తమిళనాడు లో కొన్నేళ్లుగా బలంగా పాతుకుపోయిన ఈ రెండు పార్టీ ల లో కూడా అంతర్గతంగా నడిచేది రాచరికమే. ఆ పార్టీ నాయకులనబడే మర్రిచెట్టు నీడలో మరో నాయకులు తయారవ్వలేదు. జయ మరణం తో aidmk లో విభేదాలుఓ వైపు అన్నాడీఎంకే పార్టీ రెండు గా చీలిపోవడం ఖాయం , మరో వైపు dmk లో స్టాలిన్ అళగిరి మధ్య విభేదాలు ఇద్దరి కొడుకుల మీద పట్టుకోల్పోయి వయోభారం తో కరుణాననిధి . రేపు కరుణ అనంతరం డీఎంకే కూడా రెండు గా చీలిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది.
సరిగ్గా ఇదే అదనుగా తమిళ్ నాడు కోటాలో పాగా కదపడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. నేరుగానో లేదా అటు ఆ రెండు పార్టీ ల లో కలిసి వచ్చే ఎదో ఒక పార్టీ పొత్తు తోనో అధికారం చేప్పట్టే దిశగా అడుగులు వేస్తోంది
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నెల రోజుల పాటు హాస్పిటల్ ఉంటే అత్యంత గోప్యంగా ఆమె వివరాలు చెప్పకుండా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం విచారణకి ఆదేశించడమో పరిస్థితి ని అదుపులో తీసుకొని పాలనా వ్యవహారాలు జయ రికవర్ అయ్యేవరకూ గవర్నర్ చేతిలో పెట్టడమో చేయాలి. కానీ అవేమీ చేయకుండా ఏ పదవీ లేని ఒక చెలికత్తె చేతిలో రాష్ట్ర పాలనా వెళ్లిపోతున్నా చూస్తూ ఊరుకొని పరోక్షంగా శశికళకి సహకరించింది. జయ మరణాంతరం మళ్ళీ శశికళ పుంజుకోకుండా ఆమె పై పాత కేసు లు తిరగతోడింది. అన్నాడీఎంకే పతనానికి ఏం చేయాలో అన్నీ చేసింది.
ఇప్పుడిక డీఎంకే వంతు ..2G స్కాం లో హఠాత్తుగా రాజా ,కనిమొళి నిర్దోషులైపోయారు. తన కవితాత్మక ప్రసంగాలతో .రచనలతో ,కొంచెం చురుకు గా ఉండే కనిమొళి మీద ద్రుష్టి పడింది. కేసు లు నుండీ బయటపడిన కృతజ్ఞతతో తమ చెప్పు చేతల్లో ఉంటుంది కనుక ఇద్దరు అన్నదమ్ముల కు పోటీగా ఇప్పడు కనిమొళి డీఎంకే వారసురాలిగా దించే ప్రయత్నం చేస్తోంది.
తమిళ నాడు రాజకీయ తెర మీద బీజేపీ ఆడిస్తున్న ఈ డ్రామా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలిసిందే
No comments:
Post a Comment